వికారాబాద్ : సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాలను కాపాడుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా మన గ్రామాలను పట్టణాలను చాలా వరకు శుభ్రం చేసుకున్నామన్నారు. అదే విధంగా అందరూ తమ పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా చేసుకోవాలని తెలిపారు. ఇంటి పరిసర ప్రాంతాలలో మురుగు నీరు నిలువకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, నీరు నిల్వ ఉండటం వల్ల దోమల వృద్ధి ఎక్కువగా ఉంటుందన్నారు. తప్పనిసరిగా ప్రజలందరూ నీటిని వేడి చేసుకొని చల్లారిన తరువాత తాగాలని సూచించారు.
ఈ సీజన్లో ప్రజలు నీటిలో తడవకుండా జాగ్రత్త వహించాలని, ఏదైనా అనారోగ్య లక్షణాలు కనబడితే వెంటనే వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలన్నారు. ప్రభుత్వం వైద్య పరీక్షల కోసం ప్రజలపై భారం పడకుండా ముందుగానే మన జిల్లా కేంద్రంలో డయాగ్నొస్టిక్ సెంటర్ను ప్రారంభించిందని గుర్తు చేశారు. అన్ని రకాల సీజనల్ వ్యాధులకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ప్రభుత్వం ఫీవర్ సర్వే రెండో భాగం నిర్వహించి ప్రజలకు సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తుందని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
అనుమానంతో భార్య గొంతు నులిమి చంపిన భర్త
సింగరేణిలో ఉద్యోగం పొందడం అదృష్టం
“బీఎమ్డబ్ల్యూ సీఈ04” ఫీచర్స్.. అదుర్స్..
అనుమానాస్పద స్థితిలో ట్రాక్టర్ మెకానిక్ మృతి
ట్రాక్టర్ పై నుంచి పడి డ్రైవర్ మృతి