చార్మినార్, ఆగస్ట్ 17 : ఒలింపిక్ పోటీల్లో బాట్మింటన్ కాంస్య పతక విజేత పి.వి సింధూ మంగళవారం భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఉదయం తన తండ్రి పి.వి రమణతో కలిసి వచ్చిన సింధూకి ఆలయ ట్రస్టీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఘనంగా పూజాధి కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఆలయ పూజారి అమ్మవారి హారతి అందించి తీర్థప్రసాదాలను అందించారు. ఆలయ ట్రస్టీ శశికళ భాగ్యలక్ష్మి అమ్మవారి జ్ఞాపికను అందించి సన్మానించారు.