మహేశ్వరం:కులమతాలకు అతీతంగా జరుపుకునే పీర్లపండుగను మండల పరిధిలోని వివిధ గ్రామాలలో మతసామరస్యం ఉట్టి పడే విధంగా జరుపుకున్నారు. ప్రజలు అలాయ్,బలాయ్ ఆటలతో గ్రామాలలో సంబురాలు అంబరాన్నంటేలా అనందగా ఆడిపాడారు. అమీర్పేట్, నాగారం గ్రామాలలో పీర్లపండుగ పదోరోజున పీర్లను గ్రామాలలో అన్ని వీధుల్లో ఊరేగించి నిమజ్జనానికి తరలించారు. పీర్ల ఉత్సవాలలో ముస్లీం నాయకులు పాల్గొని ప్రత్యేక ప్రార్ధనలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.ఈకార్యక్రమంలో నాయకులు మాజీ వక్స్బోర్డు చైర్మన్ ఎంఏసమీర్, హజీబాబ, జావిద్పటేల్,అమీర్ఖాన్ తదితర ముస్లీం నాయకులు పాల్గొన్నారు.