బాన్సువాడ, జూలై 8: బాన్సువాడలోని కల్కి చెరువు కట్ట పనులను త్వరగా, నాణ్యతతో చేపట్టాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించారు. ఆయన గురువారం ఉదయం కల్కి చెరువు కట్ట మరమ్మతు పనులను పరిశీలించారు. కట్టను పూర్తిస్థాయిలో రోలింగ్ చేపట్టాలని సూచించారు. అనంతరం బోటింగ్ పాయింట్ నిర్మించే స్థలాన్ని పరిశీలించారు. ఆయన వెంట డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, టీఆర్ఎస్ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి పోచారం సురేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, వైస్ చైర్మన్ షేక్ జుబేర్, నాయకుడు లింగం తదితరులు ఉన్నారు.
ఇంటింటికీ తాగునీరు అందించాలి
ప్రజా ప్రతినిధులు ప్రజల అవసరాలను తీర్చడంలో ముందుండాలని, పట్టణంలో ఇంటింటికీ తాగునీరు అందించాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడలోని రెండో వార్డు బీడీ వర్కర్స్ కాలనీలో గురువారం ఆయన ఎలక్ట్రిక్ బగ్గీలో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. నీళ్లు రావడం లేదని పలుమార్లు చెప్పినా కౌన్సిలర్ పట్టించుకోలేదని కాలనీవాసులు స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు. వార్డు ప్రజలకు మౌలిక వసతులు కల్పించే బాధ్యత కౌన్సిలర్లదే అని సూచించారు. వెంటనే తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. కాలనీలో డ్రైనేజీలు, సీసీ రోడ్లు అవసరం ఉన్న ప్రదేశాలను గుర్తించాలని బల్దియా చైర్మన్ జంగం గంగాధర్ను ఆదేశించారు. మిషన్ భగీరథ అధికారులతో కలిసి నల్లాలు బిగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అంజిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మోహన్నాయక్, మున్సిపల్ కమిషనర్ రమేశ్, బల్దియా వైస్చైర్మన్ జుబేర్, కౌన్సిలర్ మోతీరాం, నాయకులు ఎజాస్, బిట్ల రమేశ్, అలీమొద్దీన్ బాబా, ఆర్డబ్ల్యూఎస్ డీఈ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.