హైదరాబాద్ : నగరంలోని సైదాబాద్లో పోలీసులు ఓ రౌడీ షీటర్ను బుధవారం అరెస్టు చేశారు. ఉజాలాషా స్మశానవాటిక కేర్ టేకర్ను బెదిరించాడనే ఆరోపణలతో పోలీసులు రౌడీ షీటర్ను అరెస్టు చేశారు. దర్గా, స్మశానవాటిక విషయాల్లో రౌడీ షీటర్ మహ్మద్ నసీరుద్దీన్ అలియాస్ చక్కు నసీర్ జోక్యం చేసుకోవడంతో కేర్ టేకర్ ఎస్.ఎం.ఏ. కషీఫ్ పాషా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతేకాకుండా ఫిర్యాదుదారుడిని చంపుతానని బెదిరించడంతో పాటు రూ.10 డిమాండ్ చేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. న్యాయస్థానం జ్యూడిషియల్ కస్టడీకి ఆదేశించింది.