Hyderabad
- Nov 29, 2020 , 06:43:50
గొలుసు దొంగలపై పీడీయాక్ట్

హైదరాబాద్ : గొలుసు దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న ఇద్దరు దొంగలపై రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ పీడీ యాక్ట్ను విధించారు. హయత్నగర్ ప్రాంతానికి చెందిన రాపాని వెంకటేశ్, ముచ్చ వంశీకృష్ణ, వరికుప్పల ప్రకాశ్ పదో తరగతి వరకు చదివారు. విలాసాలకు అలవాటు పడి చదువు మధ్యలో ఆపేసి ప్రైవేటు పనులు చేస్తున్నారు. విలాసాలకు డబ్బు సరిపోకపోవడంతో 2019లో 11 గొలుసు దొంగతనాలకు పాల్పడి శివారు ప్రాంతాల్లో భయాందోళన సృష్టించారు. మీర్పేట్ పోలీసులు ఆగస్టులో నిందితులను అరెస్టు చేసి 20 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ప్రవర్తనా తీరు సరిగాలేని వెంకటేశ్, ప్రకాశ్పై సీపీ పీడీ యాక్ట్ను విధించి, ఏడాదిపాటు జైలులో ఉండేలా చర్యలు చేపట్టారు.
తాజావార్తలు
- కొనసాగుతున్న పెట్రో బాదుడు.. రూ.93 దాటిన పెట్రోల్ ధర
- బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి తుది విడత కౌన్సెలింగ్
- మే 17 నుంచి పదో తరగతి పరీక్షలు?
- శ్రీమతికి మహేష్ బర్త్డే విషెస్.. పోస్ట్ వైరల్
- రేపు బెంగాల్, అసోంలో ప్రధాని పర్యటన
- ఈ ఫొటోలోని చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..!
- 20 తీర్మానాలను ఆమోదించిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ
- బోల్తాపడిన ట్రాక్టర్.. 20 మంది కూలీలకు గాయాలు
- శివమొగ్గ ఘటనపై ప్రధాని సంతాపం
- కండ్లు చెదిరే రీతిలో.. కరిగెటలో ఫుట్బాల్ పోటీల కసరత్తు
MOST READ
TRENDING