గొలుసుకట్టు దందాలకు పాల్పడి 10 లక్షల మందిని ముంచి.. రూ.1500 కోట్లు కొల్లగొట్టిన ఇండస్ వీవా హెల్త్ సైన్స్స్ సంస్థకు చెందిన నలుగురిపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ శనివారం పీడీ చట్టం విధించారు. ఈ సంస్థ ఇండస్ వీవా ప్లాన్ పేరుతో డిపాజిటర్ల నుంచి 12,500 కట్టించుకుని..యూజర్ఐడీ, పాస్వర్డులు ఇచ్చి సభ్యులుగా చేర్చుకుంది ఆ తర్వాత చేరిన సభ్యు లు వారంలో మరో ఇద్దరిని సభ్యులుగా చేర్చితే.. వారికి వెయ్యి రూపాయల బోనస్ ఇస్తామంటూ నమ్మించింది. ఇలా.. దాదాపు 10 లక్షల మంది ఈ సంస్థలో చేరారు. ఈ కంపెనీ వ్యవహారంపై సైబరాబాద్ పోలీసు లు మార్చిలో కేసు నమోదు చేసి సంస్థ ప్రతినిధులను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న అభిలాష్ థామస్, సుబ్రహ్మ ణ్యం, ప్రేమ్కుమార్, ఇమాద్దుల్లాపై పీడీ చట్టం విధించారు. ఈ ఆర్థికనేరగాళ్లు మరో ఏడాది జైలు ఉండేలా సీపీ చర్యలు తీసుకున్నారు.