ఘట్కేసర్,ఏప్రిల్3 : సీఎం సహాయనిధి పేదలకు వరమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శనివారం ఘట్కేసర్ మున్సిపాలిటీ బొక్కోనిగూడకు చెందిన ఇద్దరికి సీఎం సహాయనిధి చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా బొక్కోనిగూడకు చెందిన బొక్క మల్లారెడ్డికి రూ.17,500, కంభం నర్సింహా రెడ్డి రూ.47500 చెక్కులను మంత్రి మల్లారెడ్డి అందజేశారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బొక్క ప్రభాకర్ రెడ్డి, మున్సిపాలిటీ టీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు ఎం.వెంకటేశ్, బొక్క జంగారెడ్డి, వార్డు అధ్యక్షుడు కంభం హరికిషన్ రెడ్డి,వినోద్రెడ్డి పాల్గొన్నారు.