ఎల్లారెడ్డి రూరల్, మార్చి 5 : పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో 16 మందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా.. ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్లు సూపరింటెండెంట్ రవీంద్రమోహన్ తెలిపారు. ఎల్లారెడ్డి పట్టణం, గండిమాసానిపేట్, రుద్రారంలో ఒక్కొక్కరికి పాజిటివ్ వచ్చినట్లు వివరించారు. దవాఖానలో 117 మందికి కొవిడ్ టీకాలను వేసినట్లు తెలిపారు. మండల పరిధిలోని మత్తమాల పీహెచ్సీలో 21 మందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా.. అందరికీ నెగెటివ్ వచ్చినట్లు తెలిపారు. 27 మందికి టీకాలు వేశామని మెడికల్ ఆఫీసర్ వెంకటస్వామి తెలిపారు.
నిజాంసాగర్, ఏప్రిల్ 5 : మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం 76 మందికి కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు ఆరోగ్య కేంద్రం వైద్యుడు రాధాకిషన్ తెలిపారు. 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. సెకండ్ వేవ్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో కొవిడ్ వాక్సిన్ తీసుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో దవాఖానకు వస్తున్నారని ఆయన తెలిపారు.
పిట్లం, ఏప్రిల్ 5 : మండలకేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో 32 మందికి ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా.. ఐదుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి రోహిత్కుమార్ తెలిపారు. ఆరోగ్యకేంద్రంలో 132 మందికి కొవిడ్ వ్యాక్సిన్ వేశామని చెప్పారు.
బీర్కూర్, ఏప్రిల్ 5 : నస్రుల్లాబాద్ గ్రామానికి చెందిన సినీ నిర్మాత కానూరి శ్రీనివాస్ మండల కేంద్రంలోని ప్రాథమిక దవాఖానలో కొవిడ్ టీకా తీసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 200 మందికి కొవిడ్ టీకాలు వేశామని మండల వైద్యాధికారి రవిరాజా తెలిపారు. 95 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. సంగెం గ్రామానికి చెందిన 16 మందికి, బరంగేడ్గి గ్రామానికి చెందిన ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు.
నాగిరెడ్డిపేట్, ఏప్రిల్ 5 : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో 30 మందికి టెస్టులు నిర్వహించగా.. 9 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్యురాలు నందిత తెలిపారు.
గాంధారి, ఏప్రిల్ 5 : మండలకేంద్రంతో పాటు ఉత్తునూర్ పీహెచ్సీలో కరోనా పరీక్షలను నిర్వహించారు. 77 మందికి ర్యాపిడ్ యాంటీజెన్ కిట్ ద్వారా పరీక్షలు నిర్వహించగా.. ఎనిమిది మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఉత్తునూర్కు చెందిన ముగ్గురికి, గాంధారిలో ముగ్గురికి, బొప్పాజివాడిలో ఒకరికి, ముదెల్లిలో ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు వివరించారు.
రామారెడ్డి, ఏప్రిల్ 5 : మండలంలోని అన్నారం పీహెచ్సీలో 33 మందికి, రామారెడ్డి పీహెచ్సీలో 47 మందికి కొవిడ్ టీకాలను వేశామని డాక్టర్లు రాము, షాహిద్ అలీ తెలిపారు. రామారెడ్డిలో 90 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. అందరికీ నెగెటివ్ వచ్చినట్లు డాక్టర్ షాహిద్ అలీ, అన్నారంలో 25 మందికి పరీక్షలు నిర్వహించగా.. రెడ్డిపేట్ గ్రామానికి చెందిన ఒకరికి పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ రాము తెలిపారు. సూపర్వైజర్ విమలాభారతి, ల్యాబ్ టెక్నీషియన్లు పవన్, శంకర్, సిబ్బంది శ్రీధర్, చంద్రకళ, మహేశ్వరి, మంజుల, లింబమ్మ పాల్గొన్నారు.
తాడ్వాయి, ఏప్రిల్ 5 : మండల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 92 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఐదుగురికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి రవీందర్రెడ్డి తెలిపారు. 56 మందికి కొవిడ్ టీకా వేసినట్లు తెలిపారు.
ఇవీ కూడా చదవండి…
కాంట్రాక్టర్ నిర్లక్ష్యం..అధికారుల అలసత్వం