మియాపూర్ : రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన పట్నం మహేందర్రెడ్డి ప్రమాణ స్వీకారంలో సహచర ఎమ్మెల్యేలు,పలువురు కార్పొరేటర్లతో కలిసి విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఈసందర్భంగా మహేందర్రెడ్డినిన ఘనంగా సన్మానించారు.
మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియాకమమైన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్ గౌడ్తో కలిసి విప్ ఆరెకపూడి గాంధీ అభినందించారు. ఈసందర్భంగా రాజును ఘనంగా సన్మానించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియామకమైన ఎమ్మెల్యే కోనేరు కోనప్పను ఆయన నివాసంలో విప్ ఆరెకపూడి గాంధీ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఎమ్మెల్సీ తాతా మధును విప్ ఆరెకపూడి గాంధీ కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావు, రఘునాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.