మన్సూరాబాద్, అక్టోబర్ 24: దసరా మేళా లాంటి కార్యక్రమాలు ఐక్యతను పెంపొందిస్తాయని మాజీ మంత్రి ఎల్.రమణ, వరంగల్ మేయర్ గుండు సుధారాణి అన్నారు. ఎల్బీనగర్, ఆటోనగర్లోని హరిణ వనస్థలి నేషనల్ పార్కులో ఎల్బీనగర్ సర్కిల్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన 19వ పద్మశాలి దసరా మేళా కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. వివిధ రంగాల్లో జాతీయ స్థాయిలో అవార్డులు సాధించిన కొలను పెద్ద వెంకయ్య, కొలను రవీందర్, గజం బలరాం, తడక రమేశ్, సాయిని భరత్, దుద్యం శంకర్లను ఎల్బీనగర్ పద్మశాలి సంఘం ప్రతినిధులు సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎల్.రమణ, వరంగల్ మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ.. పద్మశాలీలు రాజకీయ రంగంలో మరింతగా ఎదిగి తమ జాతి అభివృద్ధి కోసం పాటుపడాలని సూచించారు.
ఎల్బీనగర్ సర్కిల్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు పున్న గణేశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘం అధ్యక్షుడు శ్రీధర్ సుంకురువార్, ఉపాధ్యక్షుడు కందగంట్ల స్వామి, తెలంగాణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు మ్యాడం బాబూరావు, అఖిల భారత చేనేత విభాగం అధ్యక్షుడు ఎర్రమాద వెంకన్న, పద్మశాలి దసరా మేళా కమిటీ చైర్మన్ బురుగు తులసీదాస్ నేత, సంఘం ప్రధాన కార్యదర్శి గడ్డం లక్ష్మీనారాయణ, గౌరవ అధ్యక్షుడు వేముల రాము నేత, గౌరవ సలహాదారులు రాపోలు సుధాకర్ నేత, గుర్రం నర్సింహారావు నేత, పున్న రమణ విశ్వం నేత, రావిరాల సంధ్యారాణి, కౌకుంట్ల రవితేజ, గుర్రం శ్రావణ్, గుర్రం విశ్వేశ్వర, గోర్ల అశోక్ నేత, రుద్ర యాదగిరి తదితరులు పాల్గొన్నారు.