ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్లో విక్రయిస్తున్న ఓ వ్యాపారిని వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి 9 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు తెలిపిన వివరాల ప్రకారం.. గో ల్కొండకు చెందిన యండీ అబ్దుల్ ఖరీమ్ అత్తాపూర్లో అయేష ఎంటర్ప్రైజెస్ పేరుతో ఆక్సిజన్ సిలిండర్లు విక్రయిస్తున్నాడు. ప్రస్తుతం ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఏర్పడటంతో.. దీనిని ఆసరాగా చేసుకొని బ్లాక్మార్కెట్లో ఎక్కువ ధరకు విక్రయించాలని ప్లాన్ చేశాడు. ఇందులో భాగం గా గొల్కొండ ప్రాంతంలోని ధాన్కోట వద్ద ఉన్న తన ఇంటికి సిలిండర్లు తెచ్చి అధిక ధరకు విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజేష్ బృందం, మెహిదీపట్నం డివిజన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ బృందంతో కలిసి ఖరీమ్ ఇంటిపై దాడి చేసి ఖరీమ్ను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 7 క్యూబిక్ మీటర్లున్న
19 ఆక్సిజన్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.