పట్నా : బిహార్ లో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడితో అభ్యంతరకరంగా ఉన్నప్పుడు చూశాడనే ఆగ్రహంతో మహిళ (32) ఓ వ్యక్తి ప్రైవేట్ భాగాన్ని కోసేసిన ఘటన ముజఫర్ పూర్ జిల్లా సాహెబ్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితురాలు పవిత్రి దేవి వ్యవసాయ క్షేత్రంలో పప్పు భగత్ అనే వ్యక్తితో అభ్యంతరకరంగా ఉండగా అటుగా వెళుతున్న బాధితుడు హరీంద్ర మాంఝీ గమనించాడు.
దీంతో మాంఝీని కవ్వించిన మహిళ అతడిని పిలిపించుకుని జననాంగాన్ని కొడవలితో కోసేసింది. తీవ్రంగా గాయపడిన మాంఝీని స్థానికులు దవాఖానకు తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. పవిత్రి దేవిని అరెస్ట్ చేసిన పోలీసులు ఈ కేసులో భగత్ ప్రమేయంపైనా ఆరా తీస్తున్నారు. ఇక పవిత్రి దేవికి గతంలో వివాహమైందని, ఆమెకు పలువురు వ్యక్తులతో వివాహేతర సంబంధాలు ఉండటంతో భర్త ఆమెకు దూరమయ్యాడని దర్యాప్తులో వెల్లడైంది.