కమ్మర్పల్లి (మోర్తాడ్): తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్గా నియమితులైన ప్రొఫెసర్ లింబాద్రిని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతలు, స్కాలర్స్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గురువారం హైదరాబాద్లో ప్రొఫెసర్ లింబాద్రిని కలిశారు. ఈ సందర్భంగా ఓయూ జేఏసీ చైర్మన్, మాందాల భాస్కర్ మాట్లాడుతూ ప్రతిభకు తగినట్లుగానే ప్రొఫెసర్ లింబాద్రిని ఉన్నత విద్యామండలి చైర్మన్గా ప్రభుత్వం నియమించడం హర్శించదగిన విషయమని పేర్కొన్నారు. అంతకుముందు అనేక పదవులను సమర్థవంతంగా నిర్వహించి మంచి ఫలితాలను తీసుకువచ్చిన ఘనత ప్రొఫెసర్ లింబాద్రికి దక్కిందని గుర్తుచేశారు.
ఇందూరు జిల్లాలోని మారుమూల గ్రామం నుంచి ఎదిగివచ్చిన ఆయన అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. అంతేగాకుండా తెలంగాణ ఉద్యమంలోనూ విద్యార్థులకు అండగానిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓయూ విద్యార్థి నాయకులు బి.వినయ్, దాసరి నారాయణ, కిషోర్ పసరకొండ, రాల్, విజయ్ తదితరులు ప్రొఫెసర్ లింబాద్రిని కలిసిన వారిలో ఉన్నారు. ఇందూరు నుంచి ఉన్నత విద్యామండలి చైర్మన్గా ప్రొఫెసర్ లింబాద్రి ఎన్నికవడం సంతోషకరమైన విషయమని కమ్మర్పల్లి మండల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు సుంకరి విజయ్ అన్నారు.