ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 1: ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ వి.జగదీశ్వర్ రావుకు ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. ఓయూలోని ఈఎంఆర్సీలో ప్రొఫెసర్గా సేవలందిస్తున్న ఆయనకు వీడీగుడ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఉత్తమ పరిశోధకుడి అవార్డు ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్లో విశాఖ పట్టణంలో నిర్వహించనున్న ఇంటర్నేషనల్ సైంటిస్ట్ అవార్డ్స్ ఆన్ ఇంజినీరింగ్, సైన్స్ అండ్ మెడిసిన్ కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డును అందజేయనున్నారు. ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్, ఐసీటీ, మల్టీ మీడియా, ఈ లర్నింగ్, సోషియాలజీ రంగాలలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. ఆయన గతంలో ఈఎంఆర్సీ డైరెక్టర్గా సైతం వ్యవహరించారు. అమెరికా, చైనా, సింగపూర్, థాయిలాంగ్, హాంకాంగ్, మకావు, హవాయి దేశాల్లో పర్యటించి, వివిధ అంతర్జాతీయ సదస్సులలో తన పరిశోధనా పత్రాలు సమర్పించారు.