ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 20: యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని దెబ్బ తీస్తుంటే చూస్తూ ఊరుకోమని ఓయూ జేఏసీ చైర్మన్ మాందాల భాస్కర్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పోరాడుతామని ఉద్ఘాటించారు. ‘యూజీసీ పీహెచ్డీ నిమిత్తం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షా విధానం-పరిణామాలు’పై రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఉస్మానియా యూనివర్సిటీలోని పీజీఆర్ఆర్సీడీఈ సెమినార్ హాల్లో మంగళవారం నిర్వహించారు. సమావేశంలో మాందాల భా స్కర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం యూజీసీ ద్వారా రాష్ట్రంలోని వర్సిటీలపై పెత్తనం చేయ జూస్తోందని మం డిపడ్డారు. వర్సిటీల స్వయం ప్రతిపత్తిని ప్రశ్నార్థకంగా మార్చే నిర్ణయాలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. కార్యక్రమంలో ద్రవిడ బహుజన సమితి రాష్ట్ర అధ్యక్షుడు డా॥ జే.శ్రీనివాస్, దత్తాత్రేయ, రవీందర్ నా యక్, అశోక్ యాదవ్, హరీశ్ గౌడ్, పి.సుధాకర్, శంకర్, హబీబ్ ఖాద్రీ, గాంధీ, మచ్చా దేవేందర్ పాల్గొన్నారు.