ఉస్మానియా యూనివర్సిటీ, మే 26: ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్గా ప్రొఫెసర్ పి.లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు ఓయూ వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గతంలో ఓయూ ఇంజినీరింగ్ డీన్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం హెడ్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, ఓయూ అలూమ్ని అసోసియేషన్ స్పెషల్ ఆఫీసర్ తదితర బాధ్యతలు నిర్వర్తించారు. రిజిస్ట్రార్ పదవితో పాటు ఇతర కీలక పరిపాలనా పరమైన పదవులను సైతం ఆయన నిర్వహించారు. ఓఎస్డీ టు వీసీగా, జువాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ రెడ్యానాయక్, అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్గా కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ శ్యామల, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్గా సోషియాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ సి. గణేశ్, సికింద్రాబాద్ పీజీ కళాశాల ప్రిన్సిపల్గా ఎకానమిక్స్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ బి.సుధాకర్రెడ్డి, నిజాం కళాశాల ప్రిన్సిపల్గా ఎకానమిక్స్ విభాగానికే చెందిన ప్రొఫెసర్ నారాయణ, ఆడిట్ సెల్ జాయింట్ డైరెక్టర్గా ఎకనామిక్స్ విభాగానికి చెందిన డాక్టర్ ఎం.రాములు నియమితులయ్యారు. ఈ మేరకు వారందరికీ వీసీ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ నియామక పత్రాలు అందజేశారు.
‘