సుల్తాన్బజార్, సెప్టెంబర్ 24: ఉస్మానియా దవాఖానలో కార్పొరేట్కు దీటుగా మెరుగైన వైద్యం అందించడం అభినందనీయమని ఉస్మానియా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శశికళా రెడ్డి అన్నారు. ఉస్మానియా దవాఖాన బయో కెమిస్ట్రీ విభాగంలో టీఎస్ఎంఐడీసీ సహకారంతో ఏర్పాటు చేసిన రూ. 60 లక్షల విలువజేసే అత్యాధునిక అల్ట్రా మోడ్రన్ క్లినికల్ కెమిస్ట్రీ ఆటో అనలైజర్ యంత్రాన్ని శుక్రవారం దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్తో కలిసి ఆమె ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఈ యంత్రం సహాయంతో రోగులకు త్వరితగతిన అన్నిరకాల రక్త పరీక్షలు చేయవచ్చన్నారు. ప్రతిరోజూ 400 పరీక్షలు చేసే అవకాశం ఉండటంతో రోగికి మరింత త్వరగా వైద్య సేవలు అందించేందుకు వీలుంటుందన్నారు. దవాఖాన సీఎస్ అడ్మిన్ ఆర్ఎంవో డాక్టర్ శేషాద్రి, ఆర్ఎంఓలు, బయోకెమిస్ట్రీ విభాగం వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫ్యాకల్టీ సిబ్బంది పాల్గొన్నారు.