సుల్తాన్బజార్, అక్టోబర్ 25: ఉస్మానియా దవాఖానలో మత్తు పదార్థాలను తీసుకు వస్తే సహించేది లేదని సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ హెచ్చరించారు. రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించడంతో పాటు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్నట్లు చెప్పారు. సోమవారం కులీకుతుబ్ షా భవనం బ్లాక్ వద్ద దవాఖాన స్పెషల్ పోలీస్ సిబ్బందితో పాటు ఏజిల్ సంస్థ సెక్యూరిటీతో కలిసి దవాఖానకు వచ్చే రోగి సహాయకులను పూర్తి స్థాయిలో తనిఖీ చేసిన అనంతరమే వార్డుల్లోకి అనుమతించే ప్రక్రియను చేపట్టారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ మాట్లాడుతూ కొందరు జర్దాలు ,గుట్కాలు తిని దవాఖాన గోడలపై ఉమ్మివేయడంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారుతున్నాయని చెప్పా రు. మత్తు పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో దవాఖాన ఆవ రణలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు.