వనస్థలిపురం, ఆగస్టు 23 : రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పాలనకు ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని టీఆర్ఎస్ యూత్ జిల్లా అధ్యక్షుడు మాధవరం నర్సిహారావు అన్నారు. సోమవారం కాంగ్రెస్, బీజేపీల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. రామరాజ్యంలా ఉన్న సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి ఆయా పార్టీలు అడ్డుపడుతున్న తీరుపై ప్లెక్సీని ప్రదర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలుస్తోందన్నారు.
తెలంగాణకు అన్ని విధాలుగా అన్యాయం చేసిన బీజేపీ ఇక్కడ మాత్రం ప్రజలను పక్కదోవ పట్టించేందుకు కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. రైతుబంధు, కల్యాణలక్ష్మి, దళిత బంధు లాంటి పథకాలతో అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు సింగిని నవీన్కుమార్, నర్రా ప్రశాంత్రెడ్డి, భాస్కర్, శ్రీకాంత్, విజయ్, బన్నీ తదితరులు పాల్గొన్నారు.