మహబూబ్నగర్ : జోగులాంబ గద్వాల జిల్లాలో ఆర్డీఎస్ (రాజోలి బండ డైవర్షన్ స్కీం) కాల్వకు గండిపడింది. ఉండవల్లి మండలం ఇటిక్యాలపాడు శివారులో 34వ డిస్ట్రిబ్యూటరీ వద్ద కాల్వకు గండిపడటంతో నీరు వృథాపోతున్నది. జూరాల ప్రాజెక్టుకు వరద రావడంతో ఆర్డీఎస్ కాల్వకు అధికారులు నీటిని వదిలారు. వరద ఉధృతి కారణంగా ఈ మధ్యాహ్నం కాల్వ కోతకు గురైంది. స్థానిక రైతులు విషయాన్ని నీటిపారుదల అధికారులు దృష్టికి తీసుకెళ్లడంతో కాల్వకు పడిన గండిని పూడ్చేందుకు చర్యలు చేపట్టారు. కాల్వకు వెంటనే మరమ్మతులు చేయిస్తామని అధికారులు పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.