బంజారాహిల్స్,ఆగస్టు 15 : అన్లైన్లో బహుమతి గెలుచుకున్నారంటూ వచ్చిన ఒక లింక్ను ఒపెన్ చేయగా బ్యాంకు ఖాతా నుంచి రూ.65వేలు తస్కరించిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం 2, కమలాపురి కాలనీ ఫేజ్ 1లో నివాసం ఉంటున్న వీఎస్.గణేష్ అనే వ్యక్తి చార్టర్డ్ అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు.గత నెల 24న గుర్తుతె లియని ఫోన్ నెంబర్ నుంచి ఆన్లైన్లో బహమతి వచ్చిందంటూ ఎస్ఎమ్ఎస్ వచ్చింది.
మెసేజీని ఓపెన్ చేయడంతో పాటు దానిలో ఉన్న లింక్ను తెరవడంతో ఓటీపీ నెంబర్ వచ్చింది. దాన్ని ఎంటర్ చేయగానే మూడు విడతలుగా మొత్తం రూ.65వేల నగదు ఎస్బీఐ ఖాతా నుంచి విత్డ్రా అయ్యాయి. ఈ విషయాన్ని బ్యాంక్ అధికారులకు చెప్పి అకౌంట్ను బ్లాక్ చేయించాడు. ఈ మేరకు బాధితుడు గణేష్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.