ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.3.75 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు తెలిపిన వివరాల ప్రకారం.. . మహారాష్ట్ర పుణేకు చెందిన సందీప్ తీన్ పత్తి, క్యాషినో, ఫుట్బాల్, వాలీబాల్, హాకీ, క్రికెట్ తదితర సుమారు 300 గేమ్స్పై బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. ఇందుకు నిమ్మగడ్డ కల్యాణ్ను నియ మించుకున్నాడు. నల్లగుట్టలో బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారం అందు కున్న నార్త్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్రావు బృందం ఓ ఇంటిపై దా డి చేసి.. కల్యాణ్, ఫంటర్లు రమేశ్బా బు, యెర్రం రవితేజలను పట్టుకుని రాంగోపాల్పేట పోలీసులకు అప్పగించారు.