హైదరాబాద్: నగరంలోని టోలిచౌకిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆదివారం అర్ధరాత్రి టోలిచౌకి ఫ్లైఓవర్పై అతివేగంగా దూసుకొచ్చిన బైకు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న నవాజ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మృతిచెందిన నవాజ్.. మంగళ్హాట్ చెందినవాడిగా, గాయపడిన వ్యక్తి నాంపల్లిలోని ముర్గి మార్కెట్కు చెందినవాడిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి