ఖైరతాబాద్, సెప్టెంబర్ 7 : ఓఎల్ఎక్స్లో బుల్లెట్ బండి కొనేందుకు యత్నించిన ఓ వ్యక్తి రూ.75 వేలు పోగొట్టుకున్న సంఘటన సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చింతలబస్తీకి చెందిన ముత్యాల భాస్కర్ ఈ నెల 4న ఓఎల్ఎక్స్లో అమ్మకానికి ఉన్న బుల్లెట్ బండి చూశాడు. అందులో ఉన్న నంబర్కు ఫోన్ చేసి సాహిల్సింగ్ అనే వ్యక్తిని సంప్రదించి మాట్లాడగా రూ.42వేలకు విక్రయించేందుకు ఒప్పుకున్నాడు. ముందుగా తనకు రూ.2 వేలు ఆన్లైన్ ద్వారా పంపించాలని కోరాడు. అతడి మాటలు నమ్మిన భాస్కర్ రూ.2వేలు పంపించాడు. ఇలా దఫదఫాలుగా మొత్తం రూ.75వేలు చెల్లించాడు. ఇంకా వేయాలని కోరడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు మంగళవారం సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.