కోల్కతా: అసెంబ్లీ ఎన్నికల నాలుగో విడుత పోలింగ్ సందర్భంగా కూచ్బెహర్లో కాల్పులు చోటుచేసుకుని ఐదుగురు మృతిచెందడంపై ప్రధాని నరేంద్రమోదీ విచారం వ్యక్తంచేశారు. కూచ్బెహర్లో ఈ ఉదయం జరిగిన ఘటన చాలా బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ సిలిగురిలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన ఆయన.. కూచ్బెహర్ ఘటనను ప్రస్తావించారు.
పోలింగ్ సందర్భంగా చోటుచేసుకున్న కాల్పుల్లో ఐదుగురు మృతిచెందడం కలచివేసిందన్నారు. వారి మృతికి సంతాపం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బీజేపీకి పెరుగుతున్న మద్దతును చూసి తట్టుకోలేక దీదీ, ఆమె గూండాలు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని ప్రధాని మండిపడ్డారు. కుర్చీ చేజారిపోతున్నదనే సంగతి తెలిసి ఆమె ఈ స్థాయికి దిగజారిందని మమతను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
రాష్ట్రంలో కొత్తగా 2909 కరోనా కేసులు
ఈ రోగాలుంటే డ్రై ఫ్రూట్స్ తినాల్సిందే !
ప్లే గ్రౌండ్లో మిస్సైల్.. షాకైన పిల్లలు..!
కొవిడ్ వ్యాక్సిన్కు బదులుగా యాంటీ రాబిస్ డోసులిచ్చారు..
పెట్టుబడులకు కేరాఫ్ హైదరాబాద్
నియోజకవర్గంలో మహిళల ఓట్లన్నీ నావే: పాయెల్ సర్కార్