సైదాబాద్ : బాలుర సదనం నుంచి ఆరుగురు చిన్నారులు తప్పించుకోవటంతో సోమవారం సైదాబాద్ బాలుర సదనాన్ని అధికారులు సందర్శించి పరారీకి గల కారణాలను పరిశీలించారు. సైదాబాద్ బాలుర సదనం (బాలల సంక్షేమ, సంస్కరణల వీధిబాలల సంక్షేమ సదనం-జువైనల్ హోం) నుంచి 6 గురు చిన్నారులు పరారైన విషయం తెల్సిందే. బాలుర సదనం సూపర్వైజర్పై దాడిచేసి అక్కడి నుంచి తప్పించుకోవటంతో వికలాంగుల సంక్షేమశాఖ డైరెక్టర్ బి.శైలజా, హైదరాబాద్ జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ అంకేశ్వరరావు, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చేల్ జల్లాల చైల్డ్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు సందర్శించి స్థానిక పరిస్థితులను పరిశీలించి పరారీకి గల కారణాలను అడిగి తెలుసుకుని విచారణకు అదేశిం చారు. చిన్నారులు హోం సూపర్వైజర్ ఖదీర్పై దాడిచేయటంతోపాటు అక్కడి పరిస్థితుల దృశ్యాలను సీసీ కెమెరా పుటేజ్ ఆధారంగా పరిశీలించారు. బాలుర సదనం పర్యవేక్షణాధికారి ఎన్. నాగేశ్వర్రావు ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. తప్పించుకున్న ఆరుగురి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.