హైదరాబాద్: ఎగువన వర్షాలు తగ్గుముఖంపట్టడంతో హైదరాబాద్లోని జంట జలాశయాలకు వరద క్రమంగా తగ్గుతున్నది. దీంతో జంట చెరువుల్లో నీటిమట్టం తగ్గిపోతున్నది. ఈ నేపథ్యంలో అధికారులు హిమాయత్సాగర్ రెండు గేట్లు, ఉస్మాన్సాగర్ మొత్తం గేట్లను మూసివేశారు. హిమాయత్ సాగర్లోకి 1200 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. ప్రస్తుతం ఐదు గేట్ల ద్వారా సాగర్ నుంచి 1715 క్యూసెక్కుల నీటిని మూసీ నదిలోకి వదులుతున్నారు. హిమాయత్ సాగర్ గరిష్ఠ నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, 1762.25 అడుగుల వద్ద నీరు ఉన్నది.
ఎగువ నుంచి వరద తగ్గిపోవడంతో ఉస్మాన్ సాగర్ మొత్తం గేట్లను జలమండలి అధికారులు మూసివేశారు. చెరువులోకి ప్రస్తుతం 400 క్యూసెక్కుల నీరు వస్తున్నది. జలాశయం గరిష్ట నీటిమట్టం 1790 అడుగులకుగాను 1785.80 అడుగుల నీటిమట్టం ఉన్నది.