“ ఇఫ్లూ..ఉస్మానియా యూనివర్సిటీని ఆనుకొని ఉన్నా.. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు అప్పటి పాలకులకు చేతులు రాలేదు. ఏండ్లుగా ఆ బస్తీ నీళ్లకేడ్చింది. వరదలొస్తే చెల్లా చెదురైంది. డ్రైనేజీ నీళ్లు రోడ్లపై ఏరులా పారుతుంటే.. పాదం మోపడానికి కష్టంగా ఉండేది. మురికి కూపాల్లో బస్తీవాసులు నరకం చూశారు. బయటకెళ్లకపోతే పూట గడిచేది కాదు.. ఇంట్లోనే ఉంటే పస్తులుండాల్సిన దుస్థితి ఉండే… ఇరుకు ఇండ్లకు తోడు అధ్వానంగా రోడ్లు. అత్యవసర మందు కావాలంటే కిలోమీటర్లు నడవాల్సి వచ్చేది. దోమలు, డ్రైనేజీ దుర్వాసన, సాయంత్రం తాగుబోతుల వీరంగం.. ఇలా ఒకప్పుడు వడ్డెరబస్తీ..(మాణికేశ్వర్నగర్) వెనుకబాటుకు కేరాఫ్గా నిలిచింది.”
“ ఒకప్పుడు ఈ బస్తీని ఎవరూ పట్టించుకోలే. ఎన్నోసార్లు నీళ్లు.. రోడ్లు.. సక్రమమైన డ్రైనేజీ కోసం, నాయకులు, అధికారుల చుట్టూ తిరిగాం. చిన్న మందు బిల్ల కొనుకోవాలన్నా..చాలా దూరం నడిచి.. రైల్ ట్రాక్ దాటి.. వారాసిగూడకు వెళ్లే వాళ్లం. ఇకడ ఎలాంటి షాపులు ఉండేవి కావు. చిన్న దుకాణాలు అకడకడా ఉండేవి. వర్షం వస్తే నీళ్లన్నీ రోడ్లపైకి వచ్చేవి. ఇండ్లల్లోకి కూడా మురికి నీరు చేరేది. ఇక మా రాత ఇంతే.. అనుకునేవాళ్లం. తెలంగాణ వచ్చాక మా బతుకులు బాగుపడ్డాయి. కావాల్సినవన్నీ ఇకడే దొరుకుతున్నాయి. రోడ్లన్నీ బాగయ్యాయి. నీళ్లు పుషలంగా వస్తున్నాయి..” అని బస్తీకి చెందిన పాపారావు ఆనందం వ్యక్తం చేశారు.
సిటీబ్యూరో, జూలై 4 ( నమస్తే తెలంగాణ ) : ఒకప్పుడు బస్తీ సమస్యలు చెప్పడానికి ప్రభుత్వ కార్యాలయాలు.. రాజకీయ నాయకుల ఇండ్ల చుట్టూ తిరిగేవాళ్లు. నేడు సమస్య ఏంటని తెలుసుకోవడానికి ఆ ఇండ్ల చుట్టూ తిరుగుతున్నది యంత్రాంగం. ప్రతి గడప చుడుతూ.. ప్రజల బాగోగులు తెలుసుకుంటున్నారు ప్రజాప్రతినిధులు. మీ ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం ఉందా..? మీకు ట్యాప్ నీళ్లొస్తున్నాయా? ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? మీ రోడ్లు? డ్రైనేజీ ఎలా ఉంది? అంటూ సమస్యలు తెలుసుకుని అధికారులు పరిషరిస్తున్నారు. ఇంత మార్పు సీఎం కేసీఆర్తోనే సాధ్యమైందని మాణికేశ్వర్నగర్ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విశ్వనగరంగా దూసుకుపోతున్న హైదరాబాద్ను అభివృద్ధిలో పరుగులు పెట్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న పట్టణ ప్రగతితో నగరంలోని బస్తీలన్నీ ఆధునిక హంగులద్దుకుంటున్నాయి.
“ఇప్పుడు హైటెక్సిటీని తలపించేలా వడ్డెర బస్తీ రూపురేఖలు మారిపోయాయి. కాలనీ ప్రారంభం నుంచి మొదలుకొని చివరి వరకు విశాలమైన రహదారులు.. వైద్యశాలలు, క్లినిక్స్, హైటెక్ సెలూన్స్, మెడికల్ స్టోర్లు, ఏటీఎంలు.. అన్ని రకాల వ్యాపార సముదాయాలు వెలిశాయి. తాగునీటి సమస్యే లేదు. గృహాలు.. రోడ్లు పరిశుభ్రంగా మారాయి. ఇంటి అద్దెలు పెరిగిపోయాయి. అటు ఇఫ్లూ, ఇటు ఓయూ విశ్వవిద్యాలయాలను ఆనుకొని ఉన్న మాణికేశ్వర్నగర్ అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ఇతర రాష్ర్టాల వారు నివాసముండే ఈ ప్రాంతం.. ప్రగతి పథంలో
పయనిస్తూ.. చిన్న పట్టణాన్ని తలపిస్తున్నది.
రోడ్లు బాగయ్యాయి. బస్తీలో అన్ని రకాల షాపులు వెలుస్తున్నాయి. ఏ అవసరం ఉన్నా ఇకడే అందుబాటులో దొరుకుతున్నాయి. పింఛన్, రేషన్ వస్తున్నది. ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంటే.. చిన్న షాపు పెట్టుకున్నా కూడా బతుక వచ్చనే ధైర్యం వచ్చింది. బస్తీ ఇలా మారడం వెనుక ప్రభుత్వం చూపిస్తున్న చొరవ అమోఘం. ఒకప్పుడు హైదరాబాద్లో ఉంటున్నామా? అనే అనుమానం వచ్చేది. కానీ ఇప్పుడు మాది హైదరాబాద్ అని గర్వంగా చెప్పుకుంటాం. ఒక రూపాయి అవసరం లేకుండా మంచి వైద్యం దొరుకుతున్నది. పచ్చదనంతో కళకళలాడుతున్నది. ఎకడైనా రోడ్లు చిన్నగా పాడైనా వెంటనే బాగు చేస్తున్నారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు.- రామయ్య,బస్తీవాసి.
ఒకప్పటి బస్తీ కాదు ఇది. పూర్తిగా మారిపోయింది. నా కండ్ల ముందే జరిగింది. కొన్నేండ్ల కిందట సిటీ నుంచి వెలివేసిన ప్రాంతంగా ఉండేది. వర్షం వస్తే బురదలో నడుచుకుంటూ.. వెళ్లాల్సిన దుస్థితి ఉండేది. ఇంట్లోకి డ్రైనేజీ నీళ్లు వచ్చేవి. తాగునీరు సరిగా దొరికేది కాదు. దోమలు, ఈగలతో అనారోగ్యాలతో ఇబ్బందులు పడ్డాం. మందుల కోసం ఆర్ట్స్ కాలేజీ రైల్ట్రాక్ దాటి వెళ్లేవాళ్లం. ప్రమాదాలు కూడా జరిగేవి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. మా బస్తీలోనే పదుల సంఖ్యలో మెడికల్ దుకాణాలు వచ్చాయి. బస్తీ దవాఖాన ఉంది. రోజురోజుకు ఏదో ఒక కొత్త షాపు ఏర్పాటవుతున్నది. జనాభా పెరుగుతున్నది. వ్యాపారాలు పెరిగాయి. వెయ్యి రూపాయల గిరాకీ లేని ఆ రోజుల నుంచి నేడు లక్షల్లో ఈ ప్రాంతంలో వ్యాపారం సాగుతున్నది. ఏ షాపు చూసినా.. కిటకిటలాడుతుంటుంది. తెలంగాణ రాకపోతే ఈ బస్తీ మారకపోయేది. -నర్సింహయ్య, బస్తీవాసి.
మా వడ్డెర బస్తీ ఈ రోజు హైటెక్సిటీ మాదిరిగా అన్ని వనరులున్న ప్రాంతంగా మారింది. రోడ్డు ఆ చివర నుంచి ఈ చివరి వరకు అన్నీ రకాల షాపులు ఉన్నాయి. రోడ్లు అభివృద్ధి చెందాయి. పుషలంగా నీరు వస్తున్నది. మాణికేశ్వర్నగర్కు వచ్చిన వారు.. గతంలో ఎలా ఉండేది..ఇప్పుడు ఎలా అయిందని ఆశ్చర్యపోవడం ఖాయం. ఏటీఏంలో డబ్బులు డ్రా చేయాలంటే.. రైలు పట్టాలు దాటాల్సి వచ్చేది. లేకపోతే ఓయూ లోపలికి వెళ్లేవాళ్లం. ఇప్పుడు మా ప్రాంతంలో పకపకనే ఆరు ఏటీఏంలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. -శంకరయ్య, బస్తీవాసి
ఒకప్పుడు ఉపాధి కోసం చాలా మంది ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేవాళ్లు. అభివృద్ధి మొదలయ్యాక చాలా వరకు ఇకడే ఏదో ఒక వ్యాపారం చేసుకుని ఉపాధి పొందుతున్నారు. అన్నీ వనరులు ఇకడ ఉండటంతోనే జన సంచారం పెరిగింది. దీంతో వ్యాపారాలు జోరందుకున్నాయి. ముఖ్యంగా పోలీసుల చొరవతో తరచూ జరిగే తాగుబోతుల గొడవలు సద్దుమణిగాయి. సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు. -సుగుణ, కూరగాయల వ్యాపారి.