బంజారాహిల్స్,ఆగస్టు 28 : నగరవాసులను సంగీత సాగరంలో ఓలలాడించేందుకు నాన్స్టాప్ సంగీత కచేరీ సిద్ధమవుతోంది. ఇటీవల ఇండియన్ ఐడల్ విజేత పవన్దీప్ రాజన్, రన్నరప్గా నిలిచిన తెలుగమ్మాయి షణ్ముఖప్రియ, మరో ఇద్దరు గాయకులు ప్రత్యక్ష సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శనివారం ఇండియన్ ఐడల్ విజేత పవన్దీప్ రాజన్, ఫస్ట్ రన్నరప్ అరుణిత కంజిలాల్, సెకండ్ రన్నరప్ సైలీ, థర్డ్ రన్నరప్ మహ్మద్ డానిష్,షణ్ముఖప్రియ కచేరీ వివరాలు వెల్లడించారు. సెప్టెంబర్ 2 నుంచి అక్టోబర్ 30 దాకా నగరంలోని పలు ప్రాంతాల్లో గాన కచేరీ ఉంటాయని చెప్పారు.