సికింద్రాబాద్, మార్చి 31: సికింద్రాబాద్ నియోజకవర్గంలో కరోనా నివారణకు అధికారులు చర్యలు తీసు కుంటున్నారు. ముఖ్యంగా పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు కరోనాను నివారించడం కోసం ముందస్తు చర్యలు పాటించేలా ప్రజలను చైతన్యం చేస్తున్నారు. లాక్డౌన్ను ఎత్తివేసినప్పటి నుంచి జనాలు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. చేతులు శుభ్రం చేసుకోవడం, శానిటైజర్లు వినియోగం మానేశారు. అలా కాకుండా ప్రతి ఒక్కరూ ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. గత సంవత్సరం మార్చిలో లాక్డౌన్ విధించిన సందర్భంలో అధికారులు కఠినంగానే వ్యవహరించారు. మరోసారి ఈ ఏడాది ప్రజలు నిబంధనలు పాటించేలా అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం కొన్ని పండుగలను జరుపుకోవడం నిషేధించింది. భౌతిక దూరాన్ని పాటించడంతో పాటు ముఖ్యంగా మాస్క్లను తప్పనిసరిగా ధరించేలా చర్యలు తీసుకుంటున్నారు.
కరోనా విస్తరిస్తున్న కారణంగా నివారణ చర్యలు తీసుకుంటున్నాం. నివారణ చర్యల్లో భాగంగా ఫంక్షన్హాల్లు, వ్యా పార సంస్థలకు మాస్క్లు లేకుండా అ నుమతించకూడదని హెచ్చరించాం. ప్రధాన కూడళ్లు, టిఫిన్ సెంటర్లు, హో టళ్లు, వైన్షాపులు, ఇతర మార్కెట్లు, వ్యాపార సముదాయాల వద్ద నిఘా చేస్తున్నాం. మాస్క్లేకుండా తిరిగితే జరిమానాలు విధిస్తాం. ప్రజలను చైతన్యం చేసేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంటాం. – బాలగంగిరెడ్డి, చిలకలగూడ ఇన్స్పెక్టర్
ఇప్పటికే వాహనదారులను చైతన్యం చేయడం కోసం ప్రదర్శనలు చేస్తు న్నాం. రోడ్డుపైకి వచ్చే ప్రతి వాహనదారుడిని చైతన్యం చేయడం ల క్ష్యంగా పెట్టుకున్నాం. కార్లు, ద్వి చక్ర వాహనాలు, భారీ వాహనాలు, బ స్సులు, లారీలు, టిప్పర్లాంటి ఎ లాంటి వాహనాలు నడుపుతున్నా మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. మాస్క్లు ధరించకుండా వాహనాలు నడిపేవారిపై కఠినంగా వ్యవహరిస్తాం. -శ్రీనివాస్, గోపాలపురం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్
కరోనా నివారణకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రభు త్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నాం. వ్యా పారాలు చేసుకునేవారు , వినియోగదారులు భౌతిక దూ రం పాటించేలా ఏర్పాట్లు చేసుకోవాలి. నిబంధనలు పాటించని వ్యాపార సంస్థల పై కఠినంగా వ్యవహరిస్తాం. ముఖ్యంగా వారాంతపు సంతలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. -పల్లె మోహన్రెడ్డి, డిప్యూటీ కమిషనర్