హైదరాబాద్ : నిలోఫర్ ఆస్పత్రి డైట్ మాజీ కాంట్రాక్టర్ సురేశ్ బాబును సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. తప్పుడు బిల్లులతో రూ. 1.20 కోట్లు కాజేసినట్లు పోలీసుల విచారణలో తేలడంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించకుండానే బిల్లులను సురేశ్ క్లెయిమ్ చేసినట్లు నిలోఫర్ ఆస్పత్రి దృష్టికి వచ్చింది. దీంతో నిలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ ఇచ్చిన ఫిర్యాదుతో సీసీఎస్ పోలీసులు విచారణ జరిపి సురేశ్ను అరెస్టు చేశారు.