హయత్నగర్ : నియోజకవర్గం పరిధిలోని మందుల కులస్తుల అభివృద్ధికి కృషిచేస్తానని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.
మంగళవారం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ హయత్నగర్ డివిజన్ మాజీ అధ్యక్షుడు గుడాల మల్లేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మందుల కుల సంఘం నూతన సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించేందుకు చర్యలు చేపడతామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పారంద నర్సింగ్రావు, మందుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సరికొండ సమ్మయ్య, చెన్నబత్తిని రాంబాబు, సరికొండ రవీందర్, సింగజోగి రాజు, కివి భాయ్, మోడారాం, తదితరులు పాల్గొన్నారు.