న్యూఢిల్లీ : దేశంలో కరోనాకు వ్యతిరేకంగా టీకాల పంపిణీ కొనసాగుతున్నది. టీకాల డ్రైవ్ సోమవారం నాటికి 143వ రోజుకు చేరగా.. మొత్తం 23.59 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. 18-44 సంవత్సరాల వయస్సున వ్యక్తులకు 3.04 కోట్ల డోసులు వేసినట్లు చెప్పింది. సోమవారం రాత్రి 7 గంటల వరకు అందించిన తాత్కాలిక నివేదిక మేరకు ఒకే రోజు 31లక్షల మోతాదులు అందజేసినట్లు పేర్కొంది. రాత్రి వరకు తాత్కాలిక సమాచారం మేరకు.. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 23,59,39,165 డోసులు వేసినట్లు తెలిపింది. సోమవారం మొత్తం 31,04,989 డోసులు వేయగా.. ఇందులో 27,97,493 మంది లబ్ధిదారులకు మొదటి డోసు, 3,07,496 మంది లబ్ధిదారులకు రెండో డోసు వేసినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.