హిమాయత్నగర్,ఆగస్టు31 : సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక విలువలను పెం పొందించుకోవాలని భూలక్ష్మి ఆలయం కమిటీ అధ్యక్షుడు ఎన్.రాజేంద్ర ప్రసాద్ కోరారు. పవిత్రమైన శ్రావణ మాసం సందర్భంగా మంగళవారం నారాయణగూడలోని భూలక్ష్మి దుర్గాదేవి ఆలయంలో వివిధ రకాల కూరగాయాలతో అమ్మవారిని సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్య క్రమంలో ఆలయం కమిటీ సభ్యులు కేశబోయిన శ్రీధర్, కె.ప్రభాకర్గౌడ్, జ్ఞానేశ్వర్, శివ,నరేష్ తదితరులు పాల్గొన్నారు.