బేగంపేట్, మే 29: కొవిడ్ సంక్షోభంలో అనాథలను ఆదుకోవడాన్ని ప్రతి ఒకరూ బాధ్యతగా తీసుకోవాలని రాష్ట్ర కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ పేర్కొన్నారు. బన్సీలాల్పేటలోని ‘హోమ్ ఫర్ డిసేబుల్డ్’లోని మతి స్థిమితం లేని అనాథల కోసం హర్యానా నాగరిక్ సంఘ్, అగర్వాల్ సేవా సమాజ్లు సంయుక్తంగా ఉచిత భోజన పథకాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి నవీన్ మిట్టల్ ముఖ్య అతిథిగా విచ్చేసి శనివారం ప్రారంభించారు.
ఆయన మాట్లాడుతూ కొవిడ్ వ్యాప్తికి అన్ని రంగాలు కుదేలవుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో అనాథ శరణాలయాల నిర్వహణ కష్ట సాధ్యంగా మారుతుందన్నారు. ఆ సమయంలో హర్యానా నాగరిక్ సంఘ్, అగర్వాల్ సేవా సమాజ్ వంటి సామాజిక సేవా సంస్థలు తమ వంతు బాధ్యతగా అనాథలు, మతి స్థిమితం లేని పిల్లలకు చక్కటి నాణ్యతతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని ఉచితంగా అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా నవీన్ మిట్టల్, తన సతీమణి రిగు మిట్టల్తో కలిసి పిల్లలతో కొంత సమయాన్ని గడిపి వారికి భోజనాన్ని స్వయంగా వడ్డించారు.
హర్యానా నాగరిక్ సంఘ్, అగర్వాల్ సేవా సమాజ్ అధ్యక్షులు అంజనీ కుమార్ అగర్వాల్, పురుషోత్తమ్ అగర్వాల్లు మాట్లాడుతూ నగరంలోని 14 కేంద్రాల్లో ఉన్న అనాథ శరణాలయాలలో ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేశామన్నారు. లాక్డౌన్ కొనసాగినన్ని రోజులు అనాథలకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తామన్నారు. కార్యక్రమంలో హర్యానా నాగరిక్ సంఘ్, అగర్వాల్ సేవా సమాజ్ నేతలు లక్ష్మినారాయణ అగర్వాల్, సంతీప్ మిట్టల్, సంజీవ్ అగర్వాల్, అనిల్ సరాఫ్, సంజన జలాన్, సతీష్ అగర్వాల్, రాజేష్ కేడియా, దిలీప్ పన్సారీ, యోగేష్ భన్సల్, నరేష్ జైన్ తదితరులు పాల్గొన్నారు.