కురవి, మే 18: మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ పీవీ గౌతమ్ నేరుగా కరోనా బాధితుల ఇండ్లకే వెళ్లారు. కురవిలో ముగ్గురు బాధితుల ఇండ్లకు వెళ్లి ధైర్యం చెప్పారు. ‘భయపడొద్దు. జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది’ అని అవగాహన కల్పించారు. వైద్య సిబ్బంది పర్యటిస్తున్నారా.. జ్వర సర్వే నిర్వహించారా అని ఆరా తీశారు. అంతకుముందు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి.. కురవిలో ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ, వైద్య సిబ్బంది పనితీరును మెచ్చుకున్నారు.