చాదర్ఘాట్, సెప్టెంబర్ 17: రాష్ర్టానికి చెందిన క్రీడాకారులు 4వ జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో జయకేతనం ఎగరవేశారు. ఈసందర్భంగా రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ క్రీడాకారులను అభినందించారు. హర్యానాలోని స్టేట్ సోనిపట్ గ్రామంలో బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో అండర్-12 సబ్ జూనియర్స్, యూత్, సీనియర్ ఎలైట్ మెన్-ఉమెన్ పోటీల్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర జట్లు విజయాలను కైవసం చేసుకున్నారు. మొత్తం 48 మెడల్స్ సాధించగా, స్వర్ణం-18, వెండి-19, కాంశ్యం-11 గెలుచుకున్నారు. ఈ సందర్భంగా హోం మంత్రి మహమూద్ అలీ క్రీడాకారులను సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర బాక్సింగ్ డెవలెప్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు డీఎస్ రఘు, ఉపాధ్యక్షుడు కారింగల మారుతి, ప్రధాన కార్యదర్శి రఘువీర్, బండారి ప్రసాద్, భవాని ప్రసాద్, కోచ్లు మహర్షి, సంతోష్ తదితరులు ఉన్నారు.