కవాడిగూడ, జూలై 18 : తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమి మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి అన్నారు. దోమలగూడలోని హైదరాబాద్ స్టడీ సర్కిల్లో తెలుగు భాషా చైతన్య సమితి, తెలుగు కూటమిల ఆధ్వర్యంలో ‘తెలుగు భాషా పరిరక్షణ-మన కర్తవ్యాలు’ అనే అంశంపై తెలుగు భాషా చైతన్య సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బడేసాబ్ అధ్యక్షతన ఆదివారం చర్చా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సిధారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బడేసాబ్ మాట్లాడుతూ ఈ నెల 25న తెలుగు భాషను మొదటి స్థానంలో చేర్చాలని వార్ ద్వారా చిన జీయర్స్వామికి వినతి పత్రం అందజేయనున్నట్లు తెలిపారు. ఈ చర్చా కార్యక్రమంలో తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు నాళేశ్వరం శంకరం, తెలుగు కూటమి అధ్యక్షుడు పారుపల్లి కోదండరామయ్య, తెలంగాణ జూనియర్ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుప్పిశెట్టి సురేశ్, సహస్ర సంస్థ అధ్యక్షుడు మేక రవి, రమణారెడ్డి, జూకంటి ప్రవీణ్కుమార్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.