సిటీబ్యూరో, జూలై 5 (నమస్తే తెలంగాణ): నాంపల్లి క్రిమినల్ కోర్టుల సముదాయంలో మరో 8 కోర్టులను హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ సోమవారం ప్రారంభించారు.డిజిటల్ వేదికగా నాంపల్లి మనోరంజన్లో ఏర్పాటు చేసిన కోర్టులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా హిమా కోహ్లీ మాట్లాడుతూ చెక్ బౌన్స్ కేసుల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఏర్పా టు చేసిన ఏడు మెజిస్ట్రేట్ కోర్టులు చాలా ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. అదనంగా మరో పోక్సో కోర్టు వచ్చినందు వల్ల ఆయా కేసుల విచారణ వేగవంతం అవుతుందన్నారు. కరోనా వ్యాప్తి నేప థ్యంలో నాంపల్లి కోర్టుకు రాలేకపోయాననిత్వరలో వస్తానని చెప్పా రు. ఈ కోర్టుల్లో ప్రధానంగా ఒక పోక్సో కోర్టుని, ఏడు కేవలం చెక్ బౌన్స్ కేసులను మాత్రమే విచారించే వీలున్న కోర్టులని నాంపల్లి సెషన్ జడ్జి జి.తు కారం, నాంపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మధుశేఖర్ తెలిపారు.కార్యక్రమం లో జస్టిస్ రామచంద్రరా వు, జస్టి స్ అమరనాథ్ గౌడ్, పోక్సో కోర్టు జడ్జి సునీత కుంచల, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, ఉపాధ్యక్షుడు రాజశేఖర్ గౌడ్, లక్ష్మీ నారాయణ, సం యుక్త కార్యదర్శి లక్ష్మణ్, జిల్లా కోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు.