హఫీజ్పేట, మే 15 : కరోనా దరిచేరకుండా ఆయా అపార్ట్మెంట్లలో కట్టుదిట్టమైన చర్యలు చేపడుతూ వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటున్నారు. మదీనాగూడలోని మైహోం జువెల్ గేటెడ్ కమ్యూనిటీ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒకడుగు ముందుకేసి కొవిడ్ రోగుల కోసం ఆక్సిజన్తో కూడిన ఆరు పడకలను ఏర్పాటు చేసింది. బాధితులను నిరంతరం పర్యవేక్షించేందుకు ఒక డాక్టర్ను అందుబాటులో ఉంచింది. అత్యవసర సమయంలో బయట ఆస్పత్రుల్లో బెడ్ దొరకడం లేదని, అపార్ట్మెంట్లో కేంద్రం ఏర్పాటు చేసి ఉచితంగా పడకలు, ఆక్సిజన్ సేవలు అందించడం అభినందనీయమని నివాసితులు అంటున్నారు.
అపార్టుమెంటు సముదాయంలో సుమారు 2వేల కుటుంబాలు ఉన్నాయి. కరోనా బాధితుల్లో చాలామంది ఆక్సిజన్ కోసం బయటకు వెళుతున్నారనే విషయం సంక్షేమ సంఘం దృష్టికి వచ్చింది. మొత్తం ఆరు పడకలకుగాను 2 ఆక్సిజన్ బెడ్లు, 2 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో కూడినవి ఏర్పాటు చేశాం. రోగుల పర్యవేక్షణకు డాక్టర్ను నియమించాం.- మురళీధర్రావు, అధ్యక్షుడు, మైహోం జువెల్ అపార్టుమెంట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్