చిక్కడపల్లి, జూన్ 13 : సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై యువత పెద్ద ఎత్తున్న టీఆర్ఎస్లో చేరుతున్నారని పార్టీ యువజన విభాగం నాయకుడు ముఠా జైసింహ అన్నారు. ఆదివారం గాంధీనగర్ డివిజన్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద పార్టీ నాయకుడు ముఠా జైసింహ ఆధ్వర్యంలో ముషీరాబాద్ నియోజకవర్గంలోని 6 డివిజన్లకు చెందిన దాదాపు వందకు పైగా యువకులు టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ముఠా జైసింహ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమంతో పాటు రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో యువత పెద్ద ఎత్తున్న పార్టీలో చేరుతున్నారన్నా రు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ముఠా నరేశ్, డివిజన్ అధ్యక్షుడు ఎర్రం శ్రీనివాస్గుప్తా, శ్రీకాంత్, ముచ్చకుర్తి ప్ర భాకర్, ఆకుల శ్రీనివాస్, ఎం.రాకేశ్కుమార్, జి.పరశురాం, హెచ్.హన్మంతు, పాశం రవి, శ్రీధర్రెడ్డి, మారిశెట్టి నర్సింగ్ రావు, ముఠా రామారాజు తదితరులు పాల్గొన్నారు.