కరోనా వైరస్ ప్రధాన టార్గెట్ ఊపిరితిత్తులేనా! ఎందుకంటే కొవిడ్-19 సోకిన వారిలో చాలామంది శ్వాస ఆడకనే ఇబ్బంది పడుతున్నారు ! నిజానికి వైరస్ చాలావరకు మన గొంతు ద్వారానే శరీరంలోకి ప్రవేశిస్తుంది. శ్వాసమార్గం గుండా నేరుగా వైరస్ లంగ్స్కు చేరుతుంది. కాబట్టి ముందుగా వాటిపైనే ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల శ్వాసమార్గంలో ఇన్ఫెక్షన్ ఏర్పడి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. గొంతు నొప్పి, పొడి దగ్గు వస్తోంది. కరోనా సోకిన వారిలో దాదాపు 80 శాతం మందిలో ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి. కొంతమందిలో న్యుమోనియా లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఊపిరితిత్తులను కాపాడుకోవచ్చు. కరోనావైరస్ లక్షణాలు బయటపడేసరికే 25 శాతం వరకు లంగ్స్ దెబ్బతింటాయి. కాబట్టి ఈ లక్షణాలు కనిపించగానే ఆలస్యం చేయకుండా జాగ్రత్త పడటం ద్వారా కరోనా నుంచి తొందరగా బయటపడొచ్చు.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందంటే.. మీ ఊపిరితిత్తుల్లోకి వైరస్ ప్రవేశించిందని అనుమానించాల్సిందే. ఊపిరితిత్తుల దిగువ భాగంలో వాపు లేదా నొప్పి ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. పొడి దగ్గు, దగ్గుతున్నప్పుడు నొప్పి రావడం కూడా కొవిడ్-19 పాజిటివ్గా ఉండటానికి సంకేతాలు అని గుర్తించాలి.
కొవిడ్-10 కారణంగా న్యుమోనియా రావడంతో పాటు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఉంటుంది. కొన్ని సందర్భాల్లో లంగ్స్ మొత్తం పాడైపోయి ప్రాణానికే ప్రమాదం ఏర్పడవచ్చు. ఈ వైరస్ కారణంగా న్యుమోనియా వస్తే ఊపిరితిత్తుల్లోని గాలి సంచులు మొత్తం ద్రవంతో నిండిపోయి ఊపిరితిత్తుల వాపు వస్తుంది. దీనివల్ల తీవ్రత దగ్గు రావడంతో పాటు శ్వాస తీసుకోవడం కష్టమైపోతుంది.
ఊపిరితిత్తుల ఆరోగ్యం ప్రధానంగా వాటి సామర్థ్యం, పనితీరుపై ఆధారపడి ఉంటుంది. ఊపిరితిత్తుల పనితీరు బాగుంటేనే శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ సక్రమంగా అందుతుంది. కాబట్టి ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడాలంటే వ్యాయామం చేయడం చాలా అవసరం. శారీరక శ్రమ వల్ల శ్వాస తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. తద్వారా ఊపిరితిత్తుల సంకోచ వ్యాకోచాలు పెరుగుతాయి. ఫలితంగా ఊపిరితిత్తులు ఆక్సిజన్ను గ్రహించే సామర్థ్యం పెరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలు చేయడం మంచిది. పెద్దలు అయితే కనీసం 30 నిమిషాలు, పిల్లలు అయితే గంట పాటు వ్యాయామం చేయడం ద్వారా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
లంగ్స్లో దీర్ఘకాలిక మంట తగ్గాలంటే సరైన పోషకాహారం తీసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు తినాలి. అరటి పండ్లు, యాపిల్, ద్రాక్ష, టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.
ఈ విటమిన్ సీ పండ్లు తినండి.. రోగనిరోధక శక్తి పెంచుకోండి..!
ట్రంప్ వ్యక్తిగత న్యాయవాది ఇంటిపై ఎఫ్బీఐ దాడులు
కొవిడ్ చావులపై చర్చ పనికిరానిది.. చనిపోయినవారు తిరిగిరారు : సీఎం మనోహర్ లాల్ ఖట్టర్
అంతరిక్ష కేంద్రం మొదటి మాడ్యూల్ను ప్రయోగించిన చైనా
100 రోజుల పదవీకాలం పూర్తి చేసుకున్న జో బైడెన్
బంగ్లాదేశ్లో సముద్ర తుఫాను.. లక్షకు పైగా మరణం.. చరిత్రలో ఈరోజు
ఎన్నికల అధికారులపై మరణించిన అభ్యర్థి భార్య ఫిర్యాదు
5 రోజుల్లోనే నిర్మించిన తొలి 3డీ ప్రింటింగ్ ఇల్లు
ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ వచ్చినా కరోనా రావొచ్చు : డాక్టర్ రణదీప్ గులేరియా
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..