అమరావతి : నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఫోన్ను నిబంధనల మేరకే సీజ్ చేశామని ఏపీ సీఐడీ వెల్లడించింది. ఎంపీ రఘురామకృష్ణ రాజు ఏపీ సీఐడీ డీజీ సునీల్ కుమార్పై ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుపై ఈ మేరకు సీఐడీ విభాగం స్పందించింది. ‘‘సీజ్ చేసిన 90009 22222 నంబరుతో మెసెజ్లు పంపారని ఎంపీ ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కానీ, ఫోన్ సీజ్ చేసినప్పుడు తన నంబరు 90009 11111గా రఘురామ చెప్పారు. ఫోన్లో ఏ నంబరు ఉందో విచారణాధికారికి తెలిసే అవకాశమే లేదు.
ఫోన్ను ప్రాథమిక విశ్లేషణ, డేటా, ఫొటోల డంపింగ్కు ల్యాబ్కు పంపాం. ఫోన్ స్వాధీనానికి సంబంధించిన వివరాలను కోర్టు ముందుంచాం. విశ్లేషన్ చేసిన డేటాను మే 31న గుంటూరు సీఐడీ కోర్టుకు అప్పగించాం. రఘురామ ఫోన్ మే 18 నుంచి ఫోరెన్సిక్ ల్యాబ్ కస్టడీలో ఉంది. కస్టడీలో ఉన్న ఫోన్ను అధికారులు వాడే అవకాశం లేదు. ఎంపీ రఘురామ మాపై తప్పుడు అభియోగాలు చేస్తున్నారు’’అని సీఐడీ అధికారులు వివరణ ఇచ్చారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.