చిక్కడపల్లి,మే20: అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేసేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గాంధీనగర్ డివిజన్ పరిధిలోని హేబ్రోన్ చర్చి నుంచి వై జంక్షన్ ప్రియ అపార్ట్మెంట్ వరకు రూ.49.50 లక్షల వ్యయంతో నూతన వీడీసీసీ రోడ్డు పనులు గురువారం ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలోనే నిధులు మంజూరైనా ఎన్నికల కారణంగా పనుల ప్రారంభంలో ఆలస్యమైందని తెలిపారు. నియోజకవర్గం పరిధిలో పెండింగ్లో ఉన్న పనులను గుర్తించి వెంటనే పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. లాక్డౌన్లో ట్రాఫిక్ సమస్య లేదు కాబట్టి, వీడీసీసీ రోడ్డు, డ్రైనేజీ నూతన పైపులైన్ పనులు వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు ముఠా నరేశ్, ఏఈ శ్రావణి, డీఈ సన్నీ, డివిజన్ అధ్యక్షుడు ఎర్రం శ్రీనివాస్ గుప్తా, గుండు జగదీశ్ బాబు, పరుశురాం, రాకేశ్, జహంగీర్, సాయి, సతీశ్, దయానంద్, బాలకృష్ణ పాల్గొన్నారు.
సంఘసేవకుడు శంకర్దాస్ సేవలు చిరస్మరణీయం అని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. గురువారం గాంధీనగర్లో న్యాయవాది సాయి ఆధ్వర్యంలో సంఘసేవకుడు, శాంతి యువజన సంఘం వ్యవస్థాపకుడు శంకర్దాస్ సంతాపసభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముఠా గోపాల్ శంకర్దాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు ముఠా నరేశ్, సాయి, ఎస్.దయానంద్, సంతోష్, విశాల్, ఆనంద్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రం శ్రీనివాస్గుప్తా, గుండు జగదీశ్, పరుశురాం, రాకేశ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.