కవాడిగూడ, ఏప్రిల్ 16: ముషీరాబాద్లో రోడ్ల మరమ్మతులకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ముషీరాబాద్లో రూ. 1.82 కోట్ల నిధులతో వీడీసీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన స్థానిక కార్పొరేటర్ సుప్రియ నవీన్గౌడ్తో కలిసి శంకుస్థాపన చేశారు. ముషీరాబాద్ డివిజన్ గంగపుత్ర కాలనీ నుంచి పార్శిగుట్ట వరకు రూ. 92లక్షలు, మొరంబొంద నుంచి జీఎన్ గార్డెన్ వరకు రూ. 90లక్షల వ్యయంతో వీడీసీసీ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజక వర్గంలో రోడ్లను ఆధునీకరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి జీహెచ్ఎంసీ కమిషన్ర్కు అందజేశామన్నారు. రోడ్డు నిర్మాణ పనులు పూర్తైన వెంటనే డ్రైనేజీ పైపులైన్ పనులను చేపడుతామని అన్నారు. కార్పొరేటర్ సుప్రియ నవీన్గౌడ్ మాట్లాడు తూ.. బాపూజీనగర్లో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని అన్నా రు. నూతన పైపులైన్కు నిధులు కూడా మంజూరయ్యాయని, అధికారులు పనులు ప్రారంభించడం లేదని, పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆమె ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సయ్యద్ మహ్మద్ భక్తీయార్, వరుణ్, బీజేపీ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు బద్రినారాయణ, కంచి కుమార్, ముదిరాజ్ నాయకులు డి. శివ ముదిరాజ్, జి. గోవింద్, లక్ష్మణ్గౌడ్, ప్రశాంత్, అనిల్కుమార్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.