అమీర్పేట్, సెప్టెంబర్ 27: సనత్నగర్ పీఎస్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తనకు తెలియకుండా అబార్షన్ చేయించుకుందన్న కోపంతో భార్యను గొంతు నులిమి హత్య చేశాడో వ్యక్తి. జగద్గిరిగుట్టకు చెందిన గంగాధర్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. నిజామాబాద్కు చెందిన మానస(24)తో గత నవంబర్లో వివాహమైంది. రెండు నెలలకే భర్త వేధింపులకు గురి చేస్తున్నాడంటూ.. మానస జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం పుట్టింటికి వెళ్లిపోయింది. పెద్దల జోక్యంతో తిరిగి భర్త వద్దకు వచ్చిన మానసకు మళ్లీ అతడి నుంచి వేధింపులు తలెత్తడంతో మరోసారి తల్లిదండ్రుల వద్ద వెళ్లింది. ఈ నేపథ్యంలో గర్భం దాల్చిన మానస కొద్ది రోజుల తర్వాత భర్తకు తెలియకుండా అబార్షన్ చేయించుకున్నది. గంగాధర్ భరత్నగర్లో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. అతడి తండ్రి మరణించడంతో మానస జగద్గిరిగుట్టకు వచ్చింది. ఆదివారం సాయంత్రం గంగాధర్ తన భార్యను భరత్నగర్లోని తన ఇంటికి తీసుకెళ్లగా, మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తాను గర్భం తొలగించుకున్నట్లు చెప్పడంతో కోపోద్రిక్తుడైన గంగాధర్.. మానస గొంతు నులమడంతో ఊపిరాడక మృతి చెందింది. సనత్నగర్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకొని గంగాధర్ కోసం గాలిస్తున్నారు.