మెహిదీపట్నం సెప్టెంబర్ 17: లంగర్హౌస్లో దారుణం జరిగింది. మానసిక స్థితి సరిగా లేని తండ్రి తన రెండేళ్ల కొడుకు గొంతు కోసి హత్య చేశాడు. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం…..మహ్మద్ హసీబ్(38) నుస్రత్ దంపతులకు ఇద్దరు కొడుకులు. నాలుగేండ్ల కిందట సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన హసీబ్.. రెండేండ్ల నుంచి ఖాళీగా ఉంటున్నాడు. మానసిక స్థితి సరిగా లేకపోవడంతో చికిత్స తీసుకుంటున్నాడు. శుక్రవారం సాయంత్రం తన పెద్ద కుమారుడు ఇస్మాయిల్ను కత్తితో గొంతు కోసి హతమార్చాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తులో ఉన్నట్లు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.