మియాపూర్, సెప్టెంబర్ 12 : కూతురు సమస్యపై మాట్లాడేందుకు వెళ్లగా..మామపై అల్లుడు విచక్షణారహితంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన మియాపూర్ ఠాణా పరిధిలోని ఆదిత్యనగర్లో చోటు చేసుకున్నది. ఆటో డ్రైవర్ ఒమర్తో సుభాశ్ చంద్రబోస్నగర్కు చెందిన రేష్మాబేగంకు ఆరేండ్ల కిందట వివాహం జరిగింది. దంపతుల మధ్య కొంతకాలంగా వివాదాలు కొనసాగుతుండగా, రేష్మాబేగం తండ్రి షేక్ హఫీజ్(45) ఆదివారం ఉదయం ఈ విషయమై మాట్లాడేందుకు ఆదిత్యనగర్లోని అల్లుడు ఒమర్ ఇంటికి వచ్చాడు. మామపై ఆగ్రహం పెంచుకున్న ఒమర్ ..కత్తితో అతడి తలపై పొడిచాడు. తీవ్ర రక్త స్రావంతో హఫీజ్ సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేశ్ పేర్కొన్నారు.