వినాయక్నగర్, జూలై 10: మహిళ హత్య కేసులో ముగ్గురిని అరెస్టు చేసిన ఘటన అల్వా ల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వరంగల్కు చెందిన పూలమ్మ(40) బతుకుదెరువు కో సం ఎనిమిదేళ్ల కింద అల్వాల్కు వచ్చి లోతుకుంట ప్రభుత్వ స్కూల్ ఎదురుగా గుడిసె వేసుకుని రోజూ వారి కూలీ చేసుకుంటుంది. పూలమ్మతో పాటు సాయిలు(55), మంజుల(40), వినోద(50)లు కూలీ పనిచేస్తుంటారు. వీరు నలుగురు కలిసి ఆర్థిక లావాదేవిలు నడిపిస్తున్నారు. వీరికి పూలమ్మ తరచూ అప్పులు ఇచ్చే ది. కొంత కాలంగా ఇచ్చిన అప్పులను తీర్చమ ని పూలమ్మ వారిపై ఒత్తిడి చేసింది. త్వరలోనే తీరుస్తామని కాలం వెళ్లదీస్తున్నారు. అప్పు తీర్చమని తరచూ పూలమ్మ ఒత్తిడి చేయడంతో వీరు ముగ్గురు కలసి గత నెల 25న రాత్రి పూలమ్మ గుడిసెలోకి వెళ్లి ఆమెపై ఇనుప రాడ్డుతో దాడి చేశారు. దాడిలో పూలమ్మ మరణించింది. 26న తెల్లవారు జామున విగత జీవిగా పూలమ్మ ఉం డటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశా రు. పోలీసులతో పాటు క్లూస్ టీం వచ్చి అధారాలను సేకరించారు. పోలీసులు పూలమ్మ వద్ద అప్పు తీసుకున్న ముగ్గురిని తమదైన శైలిలో ప్రశ్నించడంతో హత్య చేసినట్లు ఒప్పుకున్నారు.